1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. face beauty tips with honey

చామంతి పువ్వుల టీ, తేనె జతచేసి.. ముఖానికి ప్యాక్ వేసుకుంటే..?

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖాని

honey
బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖానికి మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
చామంతి పువ్వుల టీలో తేనె, ఓట్స్, బాదం నూనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. బియ్యపు పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. 
 
బ్రెడ్ ముక్కలను మెత్తగా రుబ్బుకుని అందులో మీగడ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. నారింజ తొక్కల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
గుడ్డుసొనతో పెరుగు కలిపి.. ఫేస్‌ప్యాక్..?