శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (13:33 IST)

సుప్రీం కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. కొత్తేమీ లేదుగా..

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరు మీదకు బదిలీ చేసిన కేసులో మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
 
అయితే ఆ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
తమ తీర్పుపై పునఃసమీక్ష చేయడానికి మాల్యా వేసిన పిటిషన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017 మే 9న విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ మాల్యా మరోసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.