శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (17:29 IST)

కరోనాను అంటించి.. రిలాక్స్ అయిన చైనా.. థియేటర్స్ ఓపెన్

కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనా ప్రస్తుతం కోవిడ్ నుంచి తప్పించుకుని.. యధావిధిగా జీవనాన్ని సాగిస్తోంది. పచ్చి మాంసాన్ని ఇట్టే లాగిస్తూ.. ఆహారం విషయంలో గాడితప్పిన చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాల్లో భారీగా ప్రాణ నష్టాలు వాటిల్లాయి. ఇంకా కరోనా వైరస్ కారణంగా జనాలు జడుసుకుంటున్నారు. 
 
ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. లాక్ డౌన్, మాస్క్‌లు వంటి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ప్రపంచ దేశాలను కరోనా వదిలిపెట్టట్లేదు. ఇలా ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో నానా తంటాలు పడుతుంటే.. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో యధావిధిగా ప్రజా జీవనం ప్రారంభం కానుంది. ఈ మేరకు చైనాలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 
 
జూలై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా అనుమతులు జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తి పూర్తిగా తొలగిపోని కారణంగా ప్రేక్షకుల క్షేమం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్ల పూర్తి సామర్థ్యంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే హాల్‌లోకి అనుమతించాలని థియేటర్ల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
 
అలాగే ప్రేక్షకుల మధ్య కొన్ని సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా సూచించింది. ఇక సినిమా చూడాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని చైనా ప్రభుత్వం సూచించింది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న సినిమా రంగాన్ని ఆదుకునేందుకే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదీ లో రిస్క్ ప్రాంతాల్లోనే ఈ థియేటర్లను ఓపెన్ చేయనున్నట్లు చైనా తెలిపింది.