సంబంధిత వార్తలు
- ఎంతసేపూ సెల్ఫ్ వీడియోలేనా? వాళ్ళ గురించి ఆలోచన చేయండి..
- ఫ్యాంటు విప్పి నర్సును పక్కలోకి పిలిచిన జమాత్ సభ్యుడు... ఎన్ఎస్ఏ ప్రయోగం
- సినీ కార్మికుల కోసం నయనతార రూ.20 లక్షల విరాళం
- అమెరికాను కరోనా వైరస్ ఎలా కాటేస్తుందో చూడండి, ఆ దేశం చేసిన తప్పులేంటి? ఒప్పులేంటి?
- యువ ఐఏఎస్కు కరోనా వైరస్.. సెల్ఫ్ క్వారంటైన్కు కొలీగ్స్
న్యూయార్క్లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ కరోనా రోగి మృతి
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే అనేక దేశాలను సర్వనాశనం చేసిన ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పరిస్థితి విషమించి పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేలా అమెరికాలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 2.50 దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య కూడా 8 వేలు మించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 60 వేల ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు.
ఎంతలా అంటే న్యూయార్క్లో ప్రతి రెండు నిమిషాలకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్కడి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య త్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు.
తర్వాతి కథనం
