సంబంధిత వార్తలు
- ఇసుజు మోటర్స్ ఇండియా వద్ద టాప్ మేనేజ్మెంట్ మార్పు
- రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో 11 ప్రాంతాల పేర్లు
- ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అద్భుత ఫీట్.. 50వ మ్యాచ్లో 50-ప్లస్ స్కోరు
- కరోనా టీకా తర్వాత 1156 మంది మృత్యువాత.. కేరళలోనే అత్యధికం
- ఇండియన్ ఐడల్ 13వ సీజన్ విజేతగా రిషి సింగ్ - ప్రైజ్ బహుమతి ఎంతంటే...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 4వేల కేసులు
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదైనాయి. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు.
