1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (10:19 IST)

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,361 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 35,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక తాజాగా గణాంకాల ప్రకారం మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 3,05,79,106కి చేరింది. గడిచిన 24 గంటల్లో 416 మంది మృతి చెందారు. అలాగే మొత్తం మృతుల సంఖ్య 4,20,967కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 43,51,96,001 మందికి టీకాలు వేశారు.