1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media Bulletin on Covid Positive Cases

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Covid Positive Cases
దేశంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అలాగే, ఈ వైరస్ సోకి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,84,605 మొత్తం మరణాలు 4,22,022గా ఉన్నాయి. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్నవారు  కోలుకున్నవారి సంఖ్య 3,06,63,147గా ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు 3,99,436 ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ కేసు