శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (10:19 IST)

దేశంలో కరోనా కేసుల తాజా అప్డేట్స్... తెలంగాణాలో కేసులెన్ని?

దేశంలో మరికొన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 46,254 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,13,877కి చేరింది. గత 24 గంటల్లో 53,357 మంది కోలుకున్నారు. 
 
గ‌త 24 గంట‌ల సమయంలో 514 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,23,611కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 76,56,478 మంది కోలుకున్నారు. 5,41,405 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 11,29,98,959 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 
 
మరోవైపు, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,637 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,273 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,143కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,357కి చేరింది. ప్రస్తుతం 18,100 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 15,335 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 136 కేసులు నిర్ధారణ అయ్యాయి.