శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (12:27 IST)

చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. కంచెలు దాటి పారిపోయారు

china lockdown
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్‌ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.
 
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్‌ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.