శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆప్ఘాన్ - సూపర్-4కు అర్హత

afghanistan cricket team
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌తో తలపడిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆ జట్టు విజయభేరీ మోగించి సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. 
 
ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును చిత్తు చేసిన ఆప్ఘన్ కుర్రోళ్లు, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. మొసద్దక్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. 
 
ఆ తర్వాత 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘన్ జట్టు 18.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ 17 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఇబ్రహీం 42 పరుగులతే రాణించాడు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకు ఓడించంది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ మ్యాచ్ అవార్డు ముజీబ్‌కు దక్కింది. ఈ విజయంతో సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆప్ఘన్ నిలిచింది.