ఏపీలో వరల్డ్ కప్ కోలాహలం.. ఓపెనర్ల అర్థసెంచరీలు.. బరిలోకి జెమియీ, హర్మన్
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ రాష్ట్రవ్యాప్త వేడుకగా మారడంతో ఆంధ్రప్రదేశ్ ఉత్సాహంతో నిండిపోయింది. నగరాల నుండి గ్రామాల వరకు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లకు అందరూ అతుక్కుపోయారు.
ఈ పెద్ద ఘర్షణను చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో, టీమ్ ఇండియా కోసం చీర్స్, నినాదాలు ప్రతిచోటా ప్రతిధ్వనిస్తున్నాయి. భారతదేశం విజయం కోసం ప్రార్థనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈ కమ్యూనిటీ స్క్రీనింగ్లు ప్రజలను ఒకచోట చేర్చాయి. క్రీడలు హృదయాలను ఎలా అనుసంధానిస్తాయో, సానుకూల శక్తిని ఎలా వ్యాప్తి చేస్తాయో చూపిస్తున్నాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్కు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాంతో టాస్కు రెండు గంటలు ఆలస్యమైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మృతి మంధనా, షాఫాలీ భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు. షాఫాలి వర్మ 78 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లలో 87 పరుగులు సాధించింది.
అయితే సెంచరీ సాధిస్తుందనుకున్న ఆమె జఫ్తా బౌలింగ్లో అవుటైంది. అలాగే అర్ధశతకానికి చేరువైన స్మృతి మంధన 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి క్లో ట్రయాన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగింది. దీంతో అనంతరం క్రీజ్లోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్లు బ్యాటింగ్లో వున్నారు. దీంతో 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 171 పరుగులు సాధించింది.