శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (12:26 IST)

విండీస్ పర్యటనలో ధోనీ బిజీ... మాజీ దిగ్గజాలతో భేటీ

greenidge - dhoni
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బిజీగా గడుపుతున్నారు. ఆయన వింబుల్డన్ మ్యాచ్‌ను  వీక్షించడంతోపాటు ధోనీ బర్త్‌డే వేడుకలను కూడా లండన్‌లోనే జరుపుకున్నాడు. 
 
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా యువ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించిన ధోనీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లోనూ మెరిశాడు. 
 
ధోనీతోపాటు విండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
కాగా, తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుమ్రా (6/19) విజృంభణతో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (75*), శిఖర్ ధావన్‌ (31*) తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.