గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:01 IST)

క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్

ఇకపై క్రికెటర్లకు మహిళతో మసాజ్ చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మహిళా మసాజ్ థెరపిస్టును ఎంపిక చేయనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెటర్లకు మాత్రమే కాదు... ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలకు ఎంపికయ్యే క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్ చేయించనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌లో తొలిసారి మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. 
 
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. 
 
దీనిపై  ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నాయి.