బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (14:28 IST)

సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ డేంజరస్ ఆటగాళ్లు: అబ్ధుల్ రజాక్

Sachin
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్ళు అంటూ పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ గుర్తు చేసుకున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రణాళికను గుర్తుచేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 
 
గ్రీన్ ఆర్మీపై 69 వన్డేల్లో 2,526 పరుగులు చేశాడు. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఆడుతున్న రోజుల్లో భారత్‌పై పాకిస్థాన్ ప్లాన్‌ను గుర్తు చేసుకున్నాడు. 
 
దిగ్గజ బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లపై పాకిస్థాన్ కుట్ర పన్నుతుందని 43 ఏళ్ల ఆల్ రౌండర్ వెల్లడించాడు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఎన్‌కౌంటర్ల సమయంలో వారు జాక్‌పాట్ వికెట్‌గా ఉండేవారని అతను అభిప్రాయపడ్డాడు.
 
వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు టెండూల్కర్. చిరకాల ప్రత్యర్థులపై 69 వన్డేల్లో 2,526 పరుగులు చేశాడు. కాగా, సెహ్వాగ్ పాకిస్థాన్‌పై 31 వన్డేల్లో 1,071 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌పై టెండూల్కర్ కంటే భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఎక్కువ పరుగులు చేశాడు.
 
సెహ్వాగ్ పాకిస్థాన్‌పై కేవలం 9 టెస్టుల్లో 91.14 సగటుతో 1,276 పరుగులు చేశాడు. బ్యాటింగ్ దిగ్గజం టెండూల్కర్ పాకిస్థాన్‌తో జరిగిన 18 టెస్టు మ్యాచ్‌ల్లో 1,057 పరుగులు చేశాడు.