శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (12:50 IST)

కాంబ్లీ భార్యను తాకరాని చోట తాకాడు.. బ్యాగ్‌తో బాదేసింది.. ఎవరు?

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన తనపట్ల బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. తాకరాని చో

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన తనపట్ల బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. తాకరాని చోట పదే పదే తాకాడని ఆండ్రియా ఆరోపించారు. అంతటితో ఆగకుండా రాజేంద్ర తివారీపై ఆండ్రియా దాడి చేసింది. ఈ ఘటన ముంబైలోని ఇనార్బిట్ మాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. షాపింగ్ కోసం ముంబైలోని ఇనార్బిట్ మాల్‌కు కాంబ్లీతో పాటు ఆయన సతీమణి ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రాజేంద్ర తివారీ ఆమె పట్ల అభ్యంతరకరంగా తాకాడని తెలిసింది. ఒకసారి తనను తగిలితే ఊరుకున్నానని, పదేపదే తాకరాని చోట రాజేంద్ర తివారీ తాకుతుండటాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆండ్రియా ఆరోపించింది. 
 
అంతేగాకుండా కాంబ్లీతో పాటు ఆమె తివారీతో వాగ్వివాదానికి దిగింది. ఈ వాగ్వివాదం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఆండ్రియా తన చేతిలోని బ్యాగ్‌తో రాజేంద్రను బలంగా బాదింది. ఆ సమయంలో రాజేంద్రతో పాటు అంకిత్, అతని సోదరుడు అంకుర్ కూడా అక్కడే ఉన్నారు. 
 
ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పోలీసులకు కాంబ్లీ, ఆండ్రియా ఫిర్యాదు చేశారు. రాజేంద్ర తివారీ కూడా కాంబ్లీ దంపతులు తమపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.