శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:04 IST)

భార్యతో స్నేహితుడు వివాహేతర సంబంధం, పార్టీకి పిలిచి పిడిబాకుతో పొడిచేసాడు

స్నేహితుడే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా స్నేహితుడిని, భార్యను అంతమొందించాలనుకున్నాడు. నీట్‌గా స్కెచ్ వేసి లేపేశాడు. పని ముగించాక సరాసరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

 
కర్నూలు జిల్లా కోగిలతోట గ్రామంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడిని, భార్యను శ్రీనివాసులు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. శ్రీనివాసులు, గాయత్రికి ఎనిమిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు.

 
తన భార్య గాయత్రితో స్నేహితుడు హనుమంతు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో జీర్ణించుకోలేకపోయిన భర్త శ్రీనివాసులు ఎలాగైనా వారిని చంపాలని డిసైడ్ అయ్యాడు. స్కెచ్ వేసి హనుమంతును రాత్రి పార్టీకి పిలిచాడు.

 
ఇంటికి వచ్చిన హనుమంతుపై శ్రీనివాసులు పిడి బాకుతో పొడుస్తూ కసితీరా చంపేశాడు. ఆ తరువాత తన భార్యను కూడా కిరాతకంగా హతమార్చాడు. హత్యలు చేసిన తరువాత శ్రీనివాసులు సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ ఘటన కాస్త కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది.