శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (09:15 IST)

మరికొన్ని గంటల్లో ముహూర్తం.. పెళ్లి మండపంలో వరుడు మృతి!

మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన వరుడు గుండెపోటుతో పెళ్లి మండపంలోనే కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉట్నూరు పట్టణంలోని రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి (34) అనే వ్యక్తిగి జగిత్యాలజిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో గురువారం ఉదయం వివాహం జరగాల్సివుంది. బుధవారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్చిన ఇంటిలో చావుడప్పాలు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.