గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

యాప్ డౌన్‌లోడింగ్‌లో జాప్యం.. కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి...

crime
మొబైల్ ఫోనులో ఒక యాప్ డౌన్‌లోడ్ కావడంలో కాస్త జాప్యమైంది. దీంతో పట్టరాని కోపంతో కుమారుడిని ఓ కసాయి తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్‌కు చెందిన అశోక్ సింగ్ (64) అనే వ్యక్తి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజరుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఆదిత్య (23) కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు.
 
ఈ క్రమంలో నగదు చెల్లింపుల కోసం మొబైల్ ఫోనులో ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. కానీ, డౌన్‌లోడింగ్‌లో జాప్యం జగుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డుపడిన కొడుకును కత్తితో పొడిచాడు. 
 
ఫలితంగా ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించాల్సివచ్చింది. గాయాలకు చికిత్స చేసిన తర్వాత వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అశోక్ సింగ్‌‍పై మారణాయుధంతో కావాలని దాడికి దిగాడన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.