1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (13:37 IST)

రాజస్థాన్‌లో దారుణం: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధంతో...

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత బాలిక ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ లోని ఆళ్వారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆమెను తిజారా కల్వర్ట్ వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

 
అపస్మారక స్థితిలో వున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అంతర్భాగాలకు తీవ్రంగా గాయాలు కావడంతో రక్తస్రావం అధికమైంది. అందువల్ల ఆమెను జైపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.