1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Madhya Pradesh : Man Kills Wife for Delay to give Towel after Bath

మధ్యప్రదేశ్‌లో కిరాతక చర్య : కండువా ఇవ్వలేదని భార్య హత్య

Madhya Pradesh
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. స్నానం చేసిన తర్వాత చేతికి కండువా ఇవ్వలేదన్న కోపంతో భార్యపై 50 యేళ్ల వ్యక్తి దాడి చేసి చంపేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ బహే (50) అనే వ్యక్తి అటవీ శాఖ అధికారిగా పని చేస్తున్నారు. రాజ్‌కుమార్ స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడు. కానీ ఆమె టవల్ ఇవ్వలేదు. ఇంటి పని చేస్తున్నట్టు సమాధానమిచ్చింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై పారతో పదే పదే కొట్టడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడించింది. దీనిపై సమాచారం అందుకున్న కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 
 
కాగా, తల్లిపై తండ్రి దాడి చేస్తుండగా, 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను బెందిరంచాడని ఇన్‌స్పెక్టర్ చెప్పాడు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. 
తర్వాతి కథనం
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి రూ.1001 బహుమతి