శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (08:34 IST)

లిఫ్ట్ ఇచ్చిన పాపానికీ అనంతవాయువుల్లో కనిసిపోయాడు... ఎక్కడ?

Injection
ఓ పాదాచారికి లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబం ఇపుడు అనాథగా మిలిగిపోయింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48) అనే వ్యక్తి జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో తన పెద్ద కుమార్తె వద్ద తన భార్య ఇమాంబీని తీసుకొచ్చేందుకు బైకుపై బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో ముదిగొండ మండలంలోని పల్లభి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి లిప్ట్ అడిగారు. తమ బైకులో పెట్రోల్ అయిపోయిందని, తమలో ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోలు తెచ్చుకుంటామని చెప్పడంతో జమాల్ సరేనని వారిని ఎక్కించుకున్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత వెనుక కూర్చొన్న వ్యక్తి జమాల్‌కు ఓ ఇంజెక్షన్ సూది వేశాడు. దీంతో ఏం చేశావని ప్రశ్నించడంతో వెనుక కూర్చొన్న వ్యక్తి బైకు దిగి పరుగెత్తి.. వెనుకనే ఉన్న మరో బైక్ ఎక్కి పారిపోయాడు. 
 
అప్పటికే కళ్లు తిరగిపోతుండటంతో బైకును రోడ్డు పక్కన ఆపి స్థానికుల నుంచి నీళ్లు ఇప్పించుకుని తాగాడు. వారితోనే తన భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం తెల్సిందే. ఆ వెంటనే జమాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇంజెక్షన్ వేసేందుకు వాడిన సిరంజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పిచ్చి కుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజక్షన్‌లో ఎక్కించినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.