1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (13:13 IST)

పార్టీలో తన భార్యతో అలా ప్రవర్తించాడని ఇనుప రాడ్‌తో తలపై కొట్టి...

తనతో పనిచేసే కొలీగ్స్‌తో ఎంజాయ్ చేయడం అతనికి అలవాటు. వారం మొత్తం కష్టంపడే భర్త వారానికి ఒక్కసారి మాత్రమే తాగుతూ ఉండడంతో ఆ భార్య కూడా నో చెప్పలేదు. బయట ఎక్కడా వద్దు..ఇంటికి వచ్చి ఇక్కడే కూర్చుని తాగండి అంటూ భర్తను కోరేది భార్య. భార్య అలా చెప్పడంతో తన స్నేహితులను ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చేసేవాడు భర్త. కానీ ఆ స్నేహితులే తనను మోసం చేస్తారని ఊహించలేదు.

 
తమిళనాడు రాష్ట్రం విరూద్ నగర్ లోని కారియాపట్టి ప్రాంతానికి చెందిన బాబు ఐదేళ్ళ క్రితమే వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే కొడుకును బాబు తల్లి చూసుకుంటోంది. ఒక ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తున్న బాబుకు ఈమధ్యే మద్యం అలవాటైంది. ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అయితే భర్త ఎప్పుడూ బిజీగా ఉండడం.. సెలవు రోజు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండటంతో భార్య ఒక షరతు పెట్టింది.

 
ఇంట్లో మందు తాగండి అని కోరింది. మీకు కావాల్సినవి నేనే చేసిపెడతానంది. మొదట్లో ఒక్కడే కూర్చుని తాగే బాబు ఆ తరువాత ఫ్రెండ్స్‌ను పిలవడం ప్రారంభించాడు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వారితో కూడా కలిసి తాగేవాడు. కానీ ఈ మధ్య ఒక స్నేహితుడు మద్యం తాగిన తరువాత బాబు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న బాబు తెలుసుకోలేకపోయాడు. కానీ చివరకు భార్య ద్వారా విషయం తెలుసుకున్నాడు.


ఆ స్నేహితుడు సెంథిల్‌ను మళ్ళీ ఇంటికి పిలిపించుకున్నాడు. మద్యం తాగాడు. కోపంతో అతని తలపై రాడ్‌తో కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సెంథిల్ చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.