1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (11:03 IST)

యమునా ఎక్స్‌ప్రెస్ హైవైపై మరో నిర్భయ.. మహిళపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిపై కదులుతున్న కారులో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. క్యాబ్ డ్రైవర్, అతని ముగ్గురు స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు కామాంధులందరినీ అరెస్టు చేశారు. 
 
బుధవారం రాత్రి 8:30 గంటలకు నోయిడా సెక్టార్ 37 నుంచి ఫిరోజాబాద్‌కు ఓ మహిళ క్యాబ్‌ ఎక్కింది. ఇది యమునా ఎక్స్‌ప్రెస్‌వేపైకి వచ్చిన వెంటనే, నిందితులు మహిళను వేధించడం ప్రారంభించారు. అర్థరాత్రి 1 గంటకు ఆగ్రాలోని కుబేర్‌పూర్ ప్రాంతానికి చేరుకుని వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత మహిళను పొదల్లోకి తీసుకెళ్లి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
నిందితులు ఆ మహిళను ఆటో రిక్షాలో ఎక్కించుకుని ఫిరోజాబాద్‌కు బయలుదేరారు. ఆగ్రాలోని ఎత్మాద్‌పూర్‌లో మహిళ దిగి ఉదయం 7 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బాధను వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు, పోలీసు బృందం ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు చేరుకుని టోల్ ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా, పోలీసులు వాహనాన్ని గుర్తించి, మహిళపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
 
ఆగ్రా పోలీస్ కమిషనర్ డాక్టర్ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.