1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Corona pandemic, what is the diet to boost immunity?

మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, రోగనిరోధకత పెంచుకునే ఆహారం ఏంటి?

Corona pandemic
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు 3 లక్షలకి అటుఇటుగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి.

 
రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. ధ్యానం, యోగాసనం, ప్రాణాయామం సాధన చేయాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి తీసుకోవాలి. హెర్బల్ టీ లేదా పవిత్ర తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఎండు అల్లం, ఎండుద్రాక్ష  కషాయాలను త్రాగాలి. చక్కెరను తీసుకోవడం తగ్గించాలి, అవసరమైతే బెల్లంతో భర్తీ చేయండి. పుదీనా ఆకుల ఆవిరిని పీల్చవచ్చు.

 
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు పోరాడుతున్నప్పటికీ, ఇంట్లోనే ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యంగా తినడం, హైడ్రేట్ చేయడం, ప్రాథమిక పరిశుభ్రత అనుసరించడం ద్వారా వైరస్‌కు గురికాకుండా మన వంతు కృషి చేయవచ్చు.
తర్వాతి కథనం
సంక్రాంతి పిండివంటలు... ఔరౌర గారెలల్ల.. అయ్యారే బూరెలిల్ల