బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మోహన్ మొగిరాల
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:16 IST)

వేసవిలో మట్టికుండలో మంచినీళ్లు తాగితే...?

వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరం నుండి నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. ఈ కాలంలో తియ్యగా, చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలి. చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.
 
* ఫ్రిడ్జ్‌లో నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.
 
* మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది. అది కుండలో నింపిన నీటిలోకి ఆమ్లాలను దరిచేరకుండా చూసుకుంటుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహార పదార్థాలను తీసుకుంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* మట్టికుండలోని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా గొంతుకి సంబంధించిన రోగాలను సైతం దూరం చేసుకోవచ్చు.
 
* మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
 
* వీలైనంత వరకూ మట్టితో చేసిన పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.