శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:55 IST)

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రదాడి.. 18 మంది మృతి.. 21మందికి గాయాలు

Afganistan
Afganistan
ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
 
తాలిబాన్ ముఖ్యనేత, అఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్‌గా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తాలిబాన్ నాయకులతో సంబంధాలు ఉన్న.. ప్రముఖ మత గురువు ముజీబ్ ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. అయితే ముల్లా బారాదర్ గురించి వివరాలు వెల్లడించడం లేదు తాలిబాన్ వర్గాలు. అయితే ఈ దాడికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ చేసినట్లు తెలుస్తోంది.