శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (10:28 IST)

ఆప్ఘనిస్థాన్‌ మసీదుపై బాంబు పేలుడు-20 మందికిపైగా మృతి

blast
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. 
 
బుధవారం సాయంత్రం ఆప్ఘన్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.  
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే మసీదుపై దాడులు జరగడం గమనార్హం. ఈ పేలుడిపై ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.