1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (11:51 IST)

ఒక్కసారిగా రూ.62లక్షలిస్తే.. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక?

పండుగలకు బోనస్ ఇవ్వడం మామూలే. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన బోనస్ గురించి వింటే షాక్ కావడం తప్పనిసరి. చైనాకు చెందిన ఓ కంపెనీ తమ ప్రతి ఉద్యోగికి రూ.62లక్షలు చొప్పున బోనస్ ప్రకటించింది. చైనాలో కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏడాది.. చైనా కంపెనీలు బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. 
 
తాజాగా నాన్‌చాంగ్ నగరానికి చెందిన ఓ కంపెనీ బోనస్‌గా 300 మిలియన్ యువాన్లు (దాదాపు 33కోట్లకు పైగా) నగదును గుట్టలుగా పేర్చింది. ఈ డబ్బును ప్రదర్శనకు వుంచింది. ఇందులో ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందజేసింది. ఒకేసారి ఇంత మొత్తాన్ని ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలియక.. చైనా ఉద్యోగులు మల్లగుల్లాలు పడ్డారు.