1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (12:06 IST)

ప్రాణాంతక వైరస్ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న చైనీయులు

చైనాలో ప్రాణాంతక వైరస్ కరోనా దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో చైనీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది. 
 
అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. బుధవారం వరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు ఉంటే, ఇవాళ్టికి ఏడు వేలు దాటింది. వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొమ్మిదివేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది. 
 
అలాగే, విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈ వైరస్‌ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల మందికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.