1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:35 IST)

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం

idols demolished
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు చెలరేగిపోయారు. అనేక హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14 హిందూ దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్లలో పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఆలయాలు రోడ్డు పక్కనే ఉండటంతో దుండుగులు సులభంగా దాడి చేసేందుకు వీలుపడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన చరుల్ యూనియల్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వారి వివరాలను గుర్తుపట్టలేక పోయారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు.