జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్ల ఫైర్
Japan PM
అయితే కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతుంటే... వారిని నిర్లక్ష్యం చేసే విధంగా అబే సందేశం ఉందంటూ కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరెవరని అనుకుంటున్నారు.. అనే ట్యాగుతో షిబేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. 'ఓ వైపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రజలు పోరాడుతుంటే.. లగ్జరీ వీడియోలు చూపిస్తారా..? ఎవరూ ఏమీ చేయలేరు కానీ.. 'మీరెవరను కుంటున్నారు?' అని మాత్రం ఆశ్చర్యపోతారు..'' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం షింజో అబేకి మద్దతుగా నిలబడ్డారు. ప్రధానమంత్రికి కూడా విశ్రాంతి సమయం ఉంటుందంటూ సమర్థిస్తున్నారు. కాగా జపాన్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్యం ఏడువేలు దాటినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
