1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Massive explosion reported in Kabul days after twin bombings

కాబూల్‌లో మరో బాంబు దాడి... అమెరికా పౌరులే లక్ష్యంగా...

Massive Explosion
తాలిబన్ తీవ్రవాదుల ఆక్రమించుకున్న ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని మరోమారు బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మూడు రోజు క్రితం కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడి ఘటనను ఇంకా మరిచిపోకముందే ముష్కరులు మరోమారు రెచ్చిపోయారు. మళ్లీ బాంబు దాడితో విరుచుకుపడ్డారు. 
 
ఖవాజా బఘ్రాలోని గులాయి ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ ఇద్దరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. అయితే, ఈ దాడుల వెనుక ఐఎస్ హస్తమున్నట్టు సమాచారం. కాబూల్‌లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. 
తర్వాతి కథనం
జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని హత్య చేసిన తాలిబన్లు