1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వాషింగ్టన్ డీసీలో దుండగుడి 12 రౌండ్ల కాల్పులు... నలుగురి మృతి

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ దండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ దుండగుడు 12 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగరు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్షతగాత్రులను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. 
 
వాషింగ్టన్‌లోని నేషనల్స్‌ పార్క్‌ బేస్‌బాల్ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల్పుల చ‌ప్పుడు విన‌ప‌డ‌గానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయ‌గా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. 
 
దీంతో ఈ మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కాల్పులకు తెగబడిన వ్య‌క్తికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అధికారులు చెప్పారు. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పుల సంస్కృతి పెరిగిపోతున్న విషయం తెల్సిందే.