గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:56 IST)

భారత్ ఘోర తప్పిదం చేసింది : రికీ పాంటింగ్

ఐసీసీ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయక పోవడం ఘోర తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. 
 
సోమవారం రాజస్థాన్‌ రాయల్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ (36 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే 63 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (నాటౌట్‌) పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్‌ స్మిత్‌ 32 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్‌ 27 బంతుల్లో ఎనిమిది  ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 54 ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించగా.. రిషభ్‌ పంత్‌ మెరుపులతో కొండంత లక్ష్యం చిన్నబోయింది.
 
ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, రిషబ్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురపించాడు. పంత్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత్‌ ఘోర తప్పిదం చేసిందని చెప్పాడు. పంత్‌ ఇంగ్లీష్‌ కండిషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకునేవాడని చెప్పాడు. 
 
ముఖ్యంగా మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్నర్లను ఓ ఆట ఆడుకునేవాడు. అతన్ని ఎంపిక చేయనప్పుడే చెప్పా.. పంత్‌కు మూడు నాలుగు ప్రపంచకప్‌లు ఆడే సత్తా ఉందని, మళ్లీ చెబుతున్నా.. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటే పంత్‌కు ఆట విషయంలో తిరుగులేదని చెప్పుకొచ్చాడు.