గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (12:16 IST)

తలుపును తన్నిన అంపైర్.. రూ.5వేలు ఇచ్చాడు.. అవసరమా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్లపై జరిమానాలు మామూలైపోయాయి. మొన్నటికి మొన్న ధోనీ, నిన్నటికి నిన్న కోహ్లీలు మైదానంలో వాగ్వివాదానికి దిగిన వారే. తాజాగా ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది. 
 
బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన 20వ ఓవర్‌లో ఓ బంతిని అంపైర్ నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు. కానీ టీవీ రీప్లేలో అది నోబాల్ కాదని తేలింది. అంతే అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, ఉమేశ్ అసంతృప్తికి దిగారు. ఇంకా వాగ్వివాదానికి దిగారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా నిగెల్ వెళ్లి బంతి వేయాల్సిందిగా యాదవ్‌కు సూచించాడు. అంతేగాకుండా  సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అంపైర్ రూములోకి వెళ్లాడు. 
 
అక్కడ కోపంతో గది తలుపును తన్నడంతో.. అది కాస్త ధ్వంసమైంది. అంపైర్ తీరును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) దీనిని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాగా, ధ్వంసమైన తలుపు మరమ్మతుల కోసం అంపైర్ నిగెల్ రూ.5 వేలు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి.