సంబంధిత వార్తలు
- ట్విట్టర్ పిట్టను మించి కూత పెడుతున్న ''కూ'' యాప్.. డేటా లీక్.. జాగ్రత్త..
- సీజన్లతో సంబంధం లేదు.. సపోటాతో బరువు పరార్..
- కూ యాప్ని ఉపయోగించమని ప్రోత్సహిస్తున్న ప్రధాని, తెలుగు వారంతా కూ యాప్ తెలుగులో చేరండి
- హిజ్బుల్ ముజాహిద్దీన్ అగ్రనేత రియాజ్ ఓ లెక్కల మాస్టారు...
- సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఏమన్నారు..? ట్విట్టర్ Vs కేంద్రం...!
''కూ'' యాప్ కథ ఏంటి..? ఎలా పుట్టింది..?
Koo
దీనిని ఎమ్బీఏ స్టూడెంట్లు రాధాకృష్ణ, మయాంక్ బిడవట్కాలు రూపొందించారు. ఇందులో ట్విట్టర్ మాదిరిగానే మల్టీమీడియా పోస్ట్లు పెట్టొచ్చు. ఇక ఈ యాప్లోనూ గరిష్టంగా 400 అక్షరాలు రాసుకోవచ్చు. అది కూడా ఇంగ్లీష్తో పాటు ఆరు భారతీయ భాషల్లో. ట్విట్టర్కి ఉన్నట్లే కూ యాప్ లోగో కూడా పక్షే. అయితే బ్లూ కలర్ స్థానంలో ఎల్లో కలర్ ఉంది. అక్కడ రీట్వీట్ ఉంటే.. రీ కూ అని ఉంది. రాధాకృష్ణ, మయాంక్లకి వోకల్ అనే వీడియో, ఆడియో నాలెడ్జ్ షేరింగ్ ఫ్లాట్ఫామ్ కూడా ఉంది.
టెక్ ఇన్నోవేషన్లో ఈ యాప్ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకుంది. ఇటీవలే ఈ యాప్లో దాదాపు 4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు మైక్రో బ్లాగింగ్ సైట్ అంటే ట్విట్టరే. బాలీవుడ్ నటులతో పాటు పొలిటీషియన్స్, ఇతర ప్రముఖులు దీనినే ప్రధానంగా వాడుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా కొందరు ప్రముఖులు కూ యాప్కి మారుతున్నారు. ట్విట్టర్కి దేశంలో కోటీ 75 లక్షల మంది యూజర్లు ఉన్నారు. అమెరికా, జపాన్ తర్వాత ఇక్కడే అత్యధికం. ఇప్పుడు ఇక్కడి యూజర్లు కూ యాప్కి వలసెళ్తున్నారు.
ప్రధాని మోదీ ఇంకా యాప్లో జాయిన్ కానప్పటికీ.. గతేడాది మన్కీ బాత్లో దీనిపై మాట్లాడారు. కూ అని ఓ యాప్ ఉందని.. మన అభిప్రాయాలను మన భాషలో చెప్పుకోవచ్చని అన్నారు. అయితే ఈ రెస్పాన్స్ చూసి కూ యాప్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
