శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:30 IST)

భారత్‌లో విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్లు ఇవే...

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆపిల్ తన కొత్తరకం ఆపిల్ ఫోన్లను విడుదల చేయనుంది. వీటిని ఈ నెల  27వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని కుపర్టినో ఆపిల్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఆ ఫోన్లను లాంచ్ చేశారు. కాగా భారత్‌లో ఈ ఫోన్లు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా... వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
ఐఫోన్ 11 64జీబీ - రూ.64,900, ఐఫోన్ 11 128జీబీ - రూ.69,900, ఐఫోన్ 11 256జీబీ - రూ.79,900, ఐఫోన్ 11ప్రొ 64జీబీ - రూ.99,900, ఐఫోన్ 11ప్రొ 256జీబీ - రూ.1,13,900, ఐఫోన్ 11ప్రొ 512జీబీ - రూ.1,31,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 64జీబీ - రూ.1,09,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 256జీబీ - రూ.1,23,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 512జీబీ - రూ.1,41,900 చొప్పున ధరలు నిర్ణయించారు. ఈ  ఫోన్లు ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి.