బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (20:06 IST)

తెలంగాణ లోక్‌సభ పోల్స్... 17 సీట్లు - 443 అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‍సభ సీట్లకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 503 నానిమినేషన్లు దాఖలు చేయగా, 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో ఉన్నారు. వివిధ పార్లమెంటు స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్యా వివరాలను పరిశీలిస్తే, 
 
అదిలాబాద్ (ఎస్సీ) 11, పెద్దపల్లి (ఎస్సీ) 17, కరీంనగర్ 15, నిజామాబాద్ 185, జహీరాబాద్ 12, మెదక్ 10, మల్కాజ్‌గిరి 12, సికింద్రాబాద్ 28, హైదరాబాద్ 15, చేవెళ్ల 23, మహబూబ్ నగర్ 12, నాగర్ కర్నూల్ (ఎస్సీ) 11, నల్గొండ 27, భువనగిరి 13, వరంగల్ (ఎస్సీ) 15, పాలమూరు (ఎస్టీ) 14, ఖమ్మం 23 మంది చొప్పున మొత్తం 443 మంది బరిలో ఉన్నారు.