ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:56 IST)

లక్నో సెంట్రల్ జైలులో మరో 36మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్

jail
లక్నో సెంట్రల్ జైలులో ఖైదీలలో 36 హెచ్‌ఐవి పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇప్పటికే 27 పాజిటివ్‌ హెచ్‌ఐవీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు కొత్త సంఖ్య 63కి చేరింది. ఈ ఆందోళనకరమైన కేసుల సంఖ్య జైలు అధికారులనే కాదు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా షాక్‌కు గురి చేసింది. 
 
సెప్టెంబరులో ఒక ఖైదీ అనుమానాస్పద రీతిలో మరణించాడు. పోస్ట్‌మార్టంలో అతను ఎయిడ్స్ కారణంగా మరణించాడని తేలింది. జైలు అధికారులు వార్తలను దాచిపెట్టి, ఇతర ఖైదీలకు పరీక్షలు నిర్వహించి మరో 27 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు కనుగొన్నారు. వ్యాధి సోకిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిలిపివేశారు. 
 
రెండో దశ పరీక్షలో, మరో 36 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 63కి చేరుకుంది. జైలుకు పంపకముందే ఖైదీలకు వ్యాధి సోకిందని, సిరంజిలను పంచుకున్నారని జైలు అధికారులు వాదిస్తున్నారు.