1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (14:57 IST)

పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్.. ఏడుగురు చిన్నారుల మృతి

Adeno Virus
అడెనో వైరస్ కారణంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
తాజాగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదైనాయి.  
 
ఏడుగురు చిన్నారుల్లో కోల్‌కతాలోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
 
రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై సీఎం మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.
 
అడెనోవైరస్ సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు