గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పూణెలో పెరిగిపోతున్న జికా వైరస్ కేసులో... ఒకే రోజు 8 నమోదు

Zika
మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన పూణెలో జికా వైరస్ ప్రబలుతుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గురువారం ఒక్క రోజే ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పూణెలో గత జూన్ నెలలో మొత్తం కేసుల సంఖ్య 66 నమోదు కాగా, గురువారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఆరుగురు గర్భిణీ మహిళలు ఉండటం గమనార్హం. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 74కు చేరింది. ఆ రాష్ట్ర వైద్య నివేదికల ప్రకారం పూణెలో జికా వైరస్ బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. 
 
అయితే, మృతుల అసలు కారణాలపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు. 
 
'66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు' అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణాలకు అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది.