శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (08:15 IST)

కాకులతో కొత్త రోగం.. కరోనా వైరస్ కంటే ప్రమాదకరం!

ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ప్రజలు చచ్చి బతుకుతున్నారు. ఇపుడు కొత్తగా కాకులతో కొత్త వ్యాధి సోకుతుందట. దీనిపై కేంద్రం కూడా ఓ హెచ్చరిక చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంల కాకులతో కొత్తగా బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకుతోంది. ఇండోర్‌లో గత మూడు రోజులుగా పదుల సంఖ్యలో కాకులు చచ్చిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఇండోర్ మున్సిపల్ అధికారులు, వెటర్నరీ విభాగం అధికారులు వాటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. కాకుల మృతికి హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమని అధికారులు చెబుతున్నారు. 
 
ఇది చాలా ప్రమాదకరమని, పక్షుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇండోర్‌లోని డాలీ కాలేజీ క్యాంపస్‌లో ఇప్పటి వరకు వందకు పైగా కాకులు చనిపోయాయి. ఇండోర్‌లోని జూపార్క్ వైద్యుడు ఉత్తమ్ యాదవ్ మాట్లాడుతూ మృతి చెందిన కాకుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్టు తెలిపారు.
 
ఈ కొత్త వ్యాధిపై కేంద్రం హెచ్చరిక చేసింది. కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉందని అలర్ట్ చేసింది. 
 
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా కాకులు చనిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు చనిపోయిన కాకుల్ని టెస్ట్ చేయగా.. చనిపోయిన కాకుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీ లాల్ మీనా తెలిపారు.