ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:20 IST)

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం

bjp flags
జాతీయ రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సామాన్యం. ఇలా జాతీయ పార్టీలకు లభిస్తున్న విరాళాల్లో బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మొత్తం రూ.780.77 కోట్లు విరాళాల రూపంలో సమకూరగా, ఆ పార్టీకి ఏకంగా రూ.614.6 కోట్లు వచ్చాయి. 2020-21తో పోల్చితే బీజేపీ విరాళాల్లో 28.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. 
 
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఇక విరాళాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి రూ.95.45 కోట్లు సమకూరాయి.