గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:38 IST)

ఏపీ, తెలంగాణాలకు "స్థానిక" నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు

currency
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణాకు రూ.273 కోట్లు చొప్పున కేటాయించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.15,705 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,733 కోట్లు కేటాయించింది. ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు కేటాయిస్తుంటారు. ఇందులోభాగంగా, రూ.15,705.65 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. 
 
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి రూ.1,921 కేటాయించగా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రూ.వెయ్యికోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు లోపు మాత్రమే కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.