శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (17:45 IST)

అర్థరాత్రి నిద్రలేపి శృంగారం చేద్దామా అంటాడు... వద్దంటే దాన్ని కోసేస్తాడు...

కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై రెచ్చిపోయే కామపిశాచులు ఓవైపుంటే.. లింగబేధం లేకుండా తమ కామవాంఛను తీర్చుకోవాలనుకునే వ్యక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మానమదురైకి చెందిన మునుస్వామి అనే వ్యక్తి.. చెన్నైలో చేపల మార్కెట్లో పనిచేస్తున్నాడు. 
 
స్వతహాగా అతడు స్వలింగ సంపర్కుడు. ఫలితంగా పురుషులతో శృంగారం చేయాలనుకుంటాడు. ఇలా తన కోర్కె తీర్చుకునేందుకు మంగళవారం రాత్రి ఉత్తర చెన్నైలోని రెట్టేరి ఫ్లై ఓవర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించాడు. తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం పెట్టాడు. కానీ వాళ్లు నిరాకరించడంతో కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు తెచ్చుకున్న బ్లేడుతో ఇద్దరిలో ఓ వ్యక్తి పురుషాంగాన్ని కోసేశాజు. 
 
పగిలిన బీరు సీసా బాటిల్‌తో మరో వ్యక్తి పురుషాంగాన్ని కట్ చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మునుస్వామిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
ఈ ఘటనపై పోలీసులు వివరాల మేరకు మునుస్వామికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని, ప్రతిరోజూ రాత్రి పురుషులతో తన కామవాంఛ తీర్చుకునేందుకు రెట్టేరి ఫ్లై ఓవర్ వద్ద పడిగాపులు కాస్తుంటాడని.. చిన్నప్పటి నుంచి ఇతనికి ఈ అలవాటుందని చెప్పారు. స్కూల్ చదువుతున్నప్పుడు అతడి స్నేహితులతో శృంగారంలో పాల్గొనేవాడని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.