1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (16:40 IST)

కేంద్ర రక్షణ రంగంలో పోస్టులు..

indian army
కేంద్ర రక్షణ బలగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు చివరి తేదీ ఫిబ్రవరి 11గా నిర్ణయించారు.   
 
ఈ సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవాలంటే.. అభ్యర్థుల వయస్సు 2023 ఫిబ్రవరి 23 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వుండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పదో తరగతి లేదా అందుకు సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై వుండాలి.