1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (21:44 IST)

కరోనా బాధిత ఎమ్మెల్యే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశాడు, ఎవరు? ఎక్కడ?

ఓటుకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాముఖ్యత ఇస్తాయో, సీటు కోసం ఎంతకు దిగజారి వ్యవహరిస్తాయో తెలిపే సంఘటన ఇది. కరోనా రోగి వున్నట్లు తెలియగానే పోలీసులతో నానా హడావుడి చేసే నేతలు.. మధ్యప్రదేశ్ లో ఏకంగా పోలింగ్ బూత్ కు రప్పించి మరీ ఓటేయించారు.

వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతుండగా అప్పటికే 205 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతలో అంబులెన్స్‌ నుంచి ఒక వ్యక్తి దిగారు. అరికాలు నుండి పైన తలవెంట్రుకల వరకు మొత్తం పిపిఇ కిట్‌తో కప్పేసి ఉన్నాడు.

చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకొని వడివడిగా ఎన్నికల బూత్‌ వైపు నడిచాడు. అధికారులతో మాట్లాడి ఓటేశాడు. అతనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కునాల్‌ చౌదరి. జూన్‌ ఐదో తేదీన అనారోగ్యం పాలయిన కునాల్‌కు జూన్‌ 12వ తేదీ నాటికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నాడు.

ఇంతలో రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఇలా పూర్తిగా సురక్షిత సూట్‌లో ఎవరికి ఇబ్బంది కల్గించకుండా వచ్చి ఓటు వేశాడు. ఆయన ఓటు వేయడానికి వచ్చినప్పుడు అందరూ చాలా దూరంగా జరిగారు. అయితే కరోనా పాజిటివ్‌ వ్యక్తిని ఓటింగ్‌కు ఎలా అంగీకరిస్తారని ఎన్నికల సంఘాన్ని బిజెపి హితేష్‌ బాజ్‌పాయి ప్రశ్నించారు.