శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (07:36 IST)

పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ52 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52ను నింగిలోకి దూసుకెళ్ళింది. ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 
 
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ కౌంట‌డౌన్ మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగింది. ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ఐఆర్ శాట్ 1 ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు తయారు చేసిన ఇన్‌స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు, ఈ యేడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. 
 
ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి రి శాట్‌తో పాటు ఇన్‌స్పైర్, ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
వ్యవసాయం, సాగు, అటవీ నీటి వనరలు సమాచారం కోసం ఆర్ ఐశాట్ 1 ఉపగ్రహం భారత్, భూటాన్ దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహమే ఐఎన్ఎస్ 2టీడీ అని ఆయన వివరించారు.