ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (13:22 IST)

యువతిపై యాసిడ్ దాడి.. అమేజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు నోటీసులు

Amazon
ఢిల్లీలో 17 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు పంపింది. ఢిల్లీ యూనియన్‌లోని ద్వారక అనే ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై బాలిక ముఖం, కళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
 
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ స్థితిలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ పోసిన ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ విక్రయాలపై వివరణ ఇవ్వాలని ఫ్లిబ్‌కార్ట్, అమేజాన్‌లకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.