శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (17:28 IST)

భార్యను వ్యభిచారం చేయమన్నాడు.. నిరాకరించిందని ఏం చేశాడో తెలుసా?

భార్యాభర్తల అనుబంధానికి మనదేశ సంస్కృతినే పుట్టినిల్లు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల కాలం గడుస్తుండటంతో భార్యాభర్తల అనుబంధం కాదు.. మానవీయ విలువలే మంటగలిసిపోతున్నాయి.

కానీ ఇక్కడ కథేంటంటే.. భార్యను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన ఈ మూర్ఖుడైన భర్త.. ఆమెను వ్యభిచార రొంపిలోకి దించాలని చూశాడు.

తన అవసరాల కోసం భార్యతో వ్యభిచారం చేయించాలని చూసాడు ఆమె ఒప్పుకోక పోవడంతో మానవత్వం మరచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జలీల్ షేక్ అనేవ్యక్తి ఫతీమా సర్దార్ అనే మహిళను కొన్నేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. కొంత కాలంగా ఆమెను వ్యభిచారం చేయాలంటూ నిత్యం వేధించసాగాడు.

ఇందుకు ఆమె నిరాకరించడంతో జలీల్ ఆమెను ఆగస్టు ఐదో తేదీన హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచీలో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. 
 
స్థానికులు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. కేసును దర్యాప్తు చేయడం మొదలెట్టారు. చివరికి బాధితురాలి బంధువులు జలీల్ షేకే భార్యను చంపివుంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
భార్యను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెంచానని.. ఆమె అంగీకరించకపోవడంతో హతమార్చినట్లు పోలీసులతో జలీల్ ఒప్పుకున్నాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని అతడిపై హత్యనేరం కింద కేసునమోదు రిమాండ్‌కు తరలించారు.